Header Banner

పలు యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు నియామకం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Tue Feb 18, 2025 16:30        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు. కృష్ణ యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజీ నియామకం అయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ గా ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ప్రొఫెసర్ ఉమా నియామకం అయ్యారు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


JNTU అనంతపూర్ కు ఇన్ చార్జీ వీసీ గా ఉన్న ఆచార్య సుదర్శన్ రావ్ నే రెగ్యూలర్ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీ వీసీగా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా ఉన్న వెంకట బసవరావు నియామకం అయ్యారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వీసీ గా ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావ్ లను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #university #vc #niyamakam #nitification #todaynews #flashnews #latestupdate